రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఉప్పల్ నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ నాయకులు

Published: Thursday July 08, 2021
మేడిపల్లి, జూలై7 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ గా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గాంధీభవన్లో  ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఉప్పల్ నుంచి మాజీ కార్పొరేటర్, సీనియర్ కాంగ్రెస్ నేత మందుముల పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెల్కల మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బాకారం లక్ష్మణ్, బోరంపేట కృష్ణ, తవిడబోయిన గిరిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గాంధీ భవన్ కు తరలి వెళ్ళారు.