నూతన దంపతులను ఆశీర్వదించిన సైదులునాయక్..

Published: Tuesday July 05, 2022
ఏన్కూరు, జూలై 4 (ప్రజా పాలన న్యూస్):
వైరా నియోజకవర్గ పరిధిలోని ఏన్కూరు మండలంలోని రాయమాదారం గ్రామంలో ఓ శుభకార్యానికి కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు బాదావత్ సైదులునాయక్ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన షేక్. నన్నేకాంత్ కూతురు వివాహంలో పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో హాయిగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వైరా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు బాలు, నరసింహారావు, వెంకటేశ్వర్లు, స్థానికులు ఉన్నారు.*