ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాంసిపిఐ మధిర పట్టణ కార్యదర్శిగా బెజవాడ రవిబాబు
Published: Monday July 11, 2022
మధిర రూరల్ జులై 10ప్రజా పాలన ప్రతిని ధుప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి బాబు పేర్కొన్నారు. సిపిఐ పట్టణ మహాసభ అనంతరం పట్టణ కార్యదర్శిగా బెజవాడ రవిబాబు సహాయ కార్యదర్శిగా మంగళగిరి రామాంజనం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెజవాడ రవిబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన వెల్లడించారు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న పెన్షన్లను మంజూరు చేసేవరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.
పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి.గత మూడు రోజులుగా కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం ఉన్నదన్నారు. వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు బెజవాడ రవిబాబు విజ్ఞప్తి చేశారు. బెజవాడ రవిబాబు మంగళగిరి రామానుజనం ఎన్నిక పట్ల పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Share this on your social network: