కరోనా టీకా సురక్షితం అపోహలు పెట్టుకోవద్ద : కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి

Published: Friday October 01, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 30, (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 11వ రోజు 26వ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి పరిశీలించి వ్యాక్సినేషన్ ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎవరు ఎలాంటి అపోహ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని టీకా నూటికి నూరు శాతం సుర‌క్షిత‌మైన‌దే కాక‌, క‌రోనా ఉద్రుతి నుండి ఖ‌చ్చితంగా బ‌య‌ట‌ప‌డేస్తుంద‌ని భ‌రోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎ ఎన్ ఎమ్ పర్మిల, వార్డు ఆఫీసర్ వాజ్జిద్, హార్టి కల్చర్ ఆఫీసర్ శివ రామ్ ప్రసాద్, అఖిల్, బాలాజీ, హరీష్, ప్రవీణ్, శాలేంరాజు, వార్డ్ ప్రజలు మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు.