జూనియర్ కళాశాల ను తనకి చేసిన జిల్లా ఇంటర్ ఇంటర్మీడియట్ అధికారి. రవిబాబు

Published: Thursday September 23, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి శ్రీ కందుల రవిబాబు ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి, విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించారు. విద్యార్థులకు, సిబ్బందికి మరియు ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. రమణారెడ్డి ని కరోన నియంత్రణ నిబంధాలను పాటిస్తూ కళాశాలను నడిపించాలని సూచించారు. కళాశాలలో గదుల మరమ్మతు లకు తగిన నిధులు మంజూరు చేయించేందుకు ప్రయత్నిచమని ఎర్రుపాలెం జడ్పీటీసీ శ్రీమతి శీలం కవిత కి ఫోన్ ద్వారా విన్నపించడం జరిగింది. అందుకు ఆమె సానుకూలత వ్యక్తం చేశారు.