ఛలో హైదరాబాద్ జయ ప్రదం చేయండి.సిఐటియు
Published: Friday October 01, 2021
వలిగొండ, ప్రజాపాలన ప్రతినిధి భవన నిర్మాణం కార్మికులు వెల్పర్ బోర్డులో నమోదు వల్ల ఉన్న 1004కోట్లు ఫౌర సరఫరా శాఖకు బదిలీ చేయడాని నిరసిస్తూ అక్టోబర్ 4న జరిగే లేబర్ కమిషనర్ ముందు ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ సి ఐ టి యు జిల్లా సహాయకార్యదర్శి. తూర్కపల్లి. సురేందర్ కార్మికులుకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ని ఆవిష్కరిచడం జరిగింది. ఈ సందర్బంగా సురేందర్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించిన వెల్ఫేర్ బోర్డు ను కార్మికులు కు ఉపయోగ పడకుండా ఇతర సంస్థలకు డబ్బులు బదులా ఇంచి కార్మికులు ను మోసం చేస్తుందని ప్రభుత్వం ను విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ మండల అధ్యక్షులు ఆరూరి.నర్సింహా, కార్యదర్శి మొగిలిపాక. ఏల్లా స్వామి, మల్గా.కుమార్, చంద్రమౌళి, మధు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: