జర్నలిస్టులకు అండగా నిలుస్తా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Monday September 26, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి)
 ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి జర్నలిస్టులతో కలిసి ముందుకు సాగుతామన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టిడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా ఉప్పల్  నియోజకవర్గనికి చెందిన జర్నలిస్టులు ఎమ్మెల్యేను ఆదివారం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీకి ఎన్నికైన వారిని ఎమ్మెల్యే శాలువాతో  సత్కరించి అభినందనలు తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకటరామిరెడ్డి, ఉపాధ్యక్షులు కేసి మోహన్ , ఆర్గనైజింగ్ సెక్రెటరీ పంజాల శ్రీనివాస్ గౌడ్ , ఈసీ మెంబర్స్ గా ఎన్నికైన ఏవి. శ్రీధర్ రావు , తుంపిల్ల సతీష్ లను సత్కరించారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు తోడ్పాటు ఎల్లవేళలా అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని, వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, జర్నలిస్టులకు చేదోడుగా నిలిచిన ఎమ్మెల్యేకు పూల మొక్కను అందజేసి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలియజేశారు. అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ పథకంలో అవకాశం కల్పించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం టి డబ్ల్యూజే అధ్యక్షుడు పల్ల మహేందర్ రెడ్డి, ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నరోత్తం రెడ్డి, ఉపాధ్యక్షులు మాదిరాజు సురేష్ కుమార్, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కడియాల రమేష్ , సీనియర్ జర్నలిస్టులు వడ్డేపల్లి కిషోర్, సాంబశివ , కుమార్, నాగరాజు, పాల్గొన్నారు