వ్యాపారులకు లయన్స్ క్లబ్ ద్వారా గొడుగుల వితరణ

Published: Tuesday April 27, 2021
వెల్గటూర్, ఏప్రిల్ 26, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండల కేంద్రంలో లైన్స్ క్లబ్ ఆఫ్ వెల్గటూర్ అధ్వర్యంలో మండల కేంద్రంలోని చిరు వ్యాపారులకు సోమవారం గొడుగులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ 320 జీ జిఎంటీ కోఆర్డినేటర్ హన్మాండ్ల రాజిరెడ్డి సౌజన్యంతో జోనల్ చైర్ పర్సన్ సామ ఎల్లారెడ్డి ఆదేశాల మేరకు వెల్గటూర్ లో కూరగాయలు సోడాలు విక్రయించే చిరు వ్యాపారులకు ఈ గొడుగులు పంపిణీ చేశారు. ఎండాకాలంలో వీరికి నీడ కల్పించడానికి వీటిని పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ వెల్గటూర్ బాధ్యులు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మద్ది మురళీధర్, కార్యదర్శి వైద్య వెంకటేశ్, కోశాధికారి గట్ల రాజేందర్, ఉపాధ్యక్షులు నోముల వెంకట్ రెడ్డి, సిరిపురం తిరుపతి, పి ఆర్ ఓ నక్క సురేష్, బండారి చంద్రమౌళి, సంకోజు నరేష్, గాదాసు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.