కరోనా కట్టడి చేయలేక కేంద్రం, రాష్ట్రం పూర్తిగా విఫలం
Published: Saturday May 22, 2021
బాలపూర్, మే 21, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్న వేళ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మీర్ పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామిడిi గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలపూర్ చౌరస్తా లో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 30 వర్ధంతి ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కరోనా మహమ్మారి తీవ్రతను కేంద్రం రాష్ట్రం కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మరణాలను చోద్యం చూస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై మండిపడ్డారు. వందల కొద్దీ మరణాలు సంభవిస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని నిరుపేదలకు మాస్కులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కంచర్ల అమరేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజేందర్, స్వామి నాయక్, కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వకు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: