టిఆర్ఎస్ నియంత పాలనను అంతమొందించాలి

Published: Saturday September 17, 2022
మాజీ మంత్రి బిజెపి నాయకుడు ఏ చంద్రశేఖర్
వికారాబాద్ బ్యూరో 16 సెప్టెంబర్ ప్రజా పాలన : టిఆర్ఎస్ పార్టీ నియంత పాలనను అంతమొందించేందుకు ప్రజలు నడుం బిగించారని మాజీ మంత్రి బిజెపి నాయకుడు ఏ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా గోస - బిజెపి భరోసా బైక్ ర్యాలీ రెండో రోజు కొనసాగింది. వికారాబాద్ మండల మండల పరిధిలోని  వివిధ  గ్రామాల్లో ర్యాలీ నిర్వహించిన బిజెపి  రాష్ట్ర నాయకులు  మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఎ. చంద్రశేఖర్, కిసాన్ మోర్చాజాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి  బిజెపి జెండా ఆవిష్కరణ అనంతరం వికారాబాద్ అసెంబ్లీ బైక్ ర్యాలీ ప్రారంభించి మండలంలోని అన్ని గ్రామాలను తిరుగుతూ ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది.
ప్రతి గ్రామంలో ప్రజలకు ఈ టిఆర్ఎస్ నిరంకుశ పాలన వైఫల్యాలను వివరిస్తూ ఈ కుటుంబ పాలనను అంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తు బైక్ ర్యాలీ కొనసాగించడం జరిగింది. గ్రామాలకు వచ్చిన బిజెపి నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బందు, రుణ మాఫీ, రైతులకు ఉచిత ఎరువులు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర , జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.