చింతలపల్లిలో చప్పగా సాగిన పౌరహక్కుల దినోత్సవం శంకరపట్నం మార్చి 31 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Saturday April 01, 2023
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం పరిధిలోని చింతలపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిర్ధవారు లక్ష్మారెడ్డి, ఎంపీడీవో బషీరుద్దీన్, అంబేద్కర్ సంఘ జిల్లా నాయకులు గరిగ ప్రభాకర్, శనిగరపు ఐలయ్య, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు గొట్టే అర్జున్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కొద్దిపాటి స్థానికులు పాల్గొన్నారు. అన్ని శాఖల నుండి పై అధికారులు పాల్గొనక పోవడంతో  స్థానికులు ప్రజలు కూడా కొద్ది మందే పాల్గొనడంతో ఈ కార్యక్రమం చప్పగా సాగినట్టు అంబేద్కర్ సంఘాల  నాయకులు తెలియజేశారు.