విజయానికి సూచిక శమీ వృక్షం

Published: Monday October 11, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 10 అక్టోబర్ ప్రజాపాలన : విజయానికి సూచిక శమీవృక్షం (జమ్మి) అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గుర్తు చేశారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, 31వ వార్డు కౌన్సిలర్ గాయత్రీ లక్ష్మణ్ లతో కలిసి శివరాంనగర్ కాలనీలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుతో ఊరికో జమ్మి చెట్టు, గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జమ్మి చెట్టు మొక్కను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టును నాటడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని అన్నారు. చరిత్ర కలిగిన జమ్మి చెట్టు ఊరూర పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కౌన్సిలర్లు మల్లేపల్లి నవీన్ కుమార్, మోముల స్వాతి రాజ్ కుమార్, సుభాష్ ముదిరాజ్, మాలె శ్రీనివాస్ గుప్తా, బుస్సా శ్రీకాంత్, పార్టీ నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గోన్నారు.