అమ్మవారి అనుగ్రహంతో ఆనందంగా ఉండాలి * సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్

Published: Thursday May 19, 2022
వికారాబాద్ బ్యూరో 18 మే ప్రజాపాలన :
అమ్మవారి అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ ఆకాంక్షించారు. బుధవారం సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ వారి స్వగ్రామం ధారూర్ మండలం కేరెల్లి గ్రామంలో *మపోచమ్మ ఆలయ 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని, బోనం ఎత్తుకొని, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.