నేడే విద్యుత్ అంతరాయం మధిర

Published: Monday December 05, 2022

డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలో నేడే విద్యుత్తు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ వినియోగదారులకు తెలిపింది పెద్దగోపతి నుండి మధిర 132 కెవి సబ్ స్టేషన్ వరకు జరుగుతున్న నూతన విద్యుత్ టవర్ల నిర్మాణ పనులలో భాగంగా నేడే విద్యుత్   (సోమవారం) నాడు మధిర ,ఎర్రుపాలెం, బోనకల్లు మండలాలకు విద్యుత్ సరఫరాను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. అదేవిధంగా పగటిపూట విద్యుత్ సరఫరా నిలిపివేయబడుచుండుటవలన వ్యవసాయ పంట పొలాలకు నీటి సరఫరా లో ఇబ్బంది తలెత్తకుండా రైతుల వ్యవసాయ మోటార్లకు  రాత్రి 10 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయబడునని,  కావున వినియోగదారులు సహకరించవలసినదిగా విద్యుత్ శాఖ మధిర సబ్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీమతి ఎం. అనురాధ  కోరుచున్నారు