విద్యార్థుల అభివృద్ధికి అన్ని చర్యలు : ఎంపీపీ అరిగేల మల్లికార్జున్
Published: Wednesday December 08, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 07 (ప్రజాపాలన) : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని ఎంపిపి అరిగెల మల్లికార్జున్ అన్నారు. మండలంలోని చిర్రకుంట పాఠశాలలో 4వ తరగతి నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు"సోలార్ బల్బులు, పంపిణీ చేశారు. విద్యార్థుల సర్వతో ముఖాభి వృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రాత్రిపూట చదువుకోవడానికి సోలార్ బల్బులు అందజేస్తున్నట్లు తెలిపారు. కరెంటు లేని సమయములో విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధన్ రాజ్, పంచాయతీ సెక్రెటరీ గౌతమ్, విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: