విద్యార్థులను అభినందించిన జడ్జి ధీరజ్ కుమార్

Published: Wednesday February 22, 2023

మధిర ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి మధిర పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు గత నవంబర్ నెలలో  జాతీయస్థాయిలో  నిర్వహించిన నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్(క్యాట్) రెండవ దశ లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి. ధీరజ్ కుమార్  ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన విద్యార్థుల అభినందన సభలో జడ్జిమాట్లాడుతూ ఇలాంటి జాతి స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల కరిక్యులం, ఉపాధ్యాయులను తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రోత్సాహక నగదు బహుమతి అందుకున్న నలుగురు విద్యార్థులను 32 మంది మెరిట్ మెడల్ అందుకున్న విద్యార్థులను అభినందించారు ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఆకెళ్ళ భారతి, డీన్ శ్రీనరేష్ గూడెల్లి, అకాడమిక్ డైరెక్టర్స్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్య గార్లు, ఏజీఎం చేతన్ కుమార్ ఆర్ ఐ జయప్రకాష్ జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ ఎంవి కృష్ణారావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు