రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బిజెపి కుట్ర. ....ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠా

Published: Friday April 14, 2023
మంచిర్యాల బ్యూరో, ఎప్రిల్ 13, ప్రజాపాలన: 
 
ప్రజల తరఫున  స్పందిస్తన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బిజెపి ప్రభుత్వం, కక్ష్య సాధింపులో భాగంగా రాహుల్ గాంధీ ని పార్లమెంటుకు రాకుండా చేసిసే కుట్రనే ఆయన పై  అనర్హత వేటు అని  ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన సిఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్రకు  ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు.నేడు నిర్వహించే  సత్యాగ్రహ సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం కాపాడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించిందని అన్నారు. భారత్ జోడో లో రాహుల్ ఇచ్చిన సందేశాన్ని గడపగడపకు తీసుకెళ్లడానికి ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా హాత్ సే హాథ్ జోడో కార్యక్రమం కొనసాగుతున్నదని ఆయన అన్నారు.
 
*  ప్రజాస్వామ్యం పై బిజెపి దాడి 
 
 
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  రూపొందించిన రాజ్యాంగం పై బిజెపి దాడి చేస్తుందని విమర్శించారు.  బిజెపి అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి మద్దతుగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహ సభలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే నని ఆయన అన్నారు. పార్లమెంట్లో బిజెపి తీసుకు వచ్చిన అనేక చట్టాలకు బిఆర్ఎస్ ఎంపీలు ఓటు వేసి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న యాత్ర, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర బిఆర్ఎస్ బిజెపి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను  ఎండగట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి దోహదపడుతుందని అన్నారు.
 
 
*స‌భా ప్రాంగ‌ణాన్ని ప‌రిశీలించిన ఠాక్రే
 
తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే గురువారం సాయంత్రం మంచిర్యాల్లోని స‌త్యాగ్ర‌హ స‌భ ప్రాంగ‌ణాన్ని ప‌రిశీలించారు. స‌భా ప్రాంగ‌ణం గురించి అక్క‌డున్న స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌తో మాట్లాడారు. ఏర్పాట్ల గురించి ప్ర‌త్యేకంగా అడిగి తెలుసుకున్నారు. స‌భ‌కు వ‌చ్చే కార్య‌క‌ర్త‌లు, సామాన్య ప్ర‌జ‌ల‌కు భోజ‌నం, ఎండ ఎక్కువ‌గా ఉండ‌డంతో తాగేందుకు మంచినీళ్లు, మ‌జ్జిగ వంటి వాటిని ఏర్పాటు చేశారా? అని ప్ర‌త్యేంగా ఆరా తీశారు. లక్ష మందితో నిర్వ‌హిస్తున్న ఈ స‌భ‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని ఆయ‌న స్థానిక నాయ‌క‌లకు సూచించారు.మీడియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, సంపత్ కుమార్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, డిసిసి అధ్యక్షులు కే సురేఖ, పిసిసి నాయకులు సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.