పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Published: Wednesday December 29, 2021
బెల్లంపల్లి డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులపై ఆరా తీసిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని, పాఠశాల విషయంలో కానీ ఉపాధ్యాయుల విషయంలో కానీ ఏ సమస్య ఉన్నా తనకు వెంటనే తెలియజేస్తే తగిన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరి స్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ టి, సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, మాజీ ఎంపీపీ సుభాష్ రావు, గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.