గొర్రెలలో నట్టల నివారణకు మందు పట్టించే కార్యక్రమం శంకరపట్నం ఫిబ్రవరి 20ప్రజాపాలన రిపోర్టర్

Published: Tuesday February 21, 2023

శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాలలో గొర్రెలలో నట్టల నివారణకు మందు పట్టించే కార్యక్రమం ఈనెల 22 నుండి 28 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు పశు వైద్యులు డాక్టర్ భాగ్యలక్ష్మి, మాధవరావులు సోమవారం తెలిపారు.  ఈ యొక్క అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాలలో గల గొర్రెల పెంపకం దారులు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈనెల 22న కొత్తగట్టు, గొల్లపల్లి, అంబాలపూర్, 23న ధర్మారం, తాడికల్, కన్నాపూర్, 24న మొలంగూర్, చింతలపల్లి ఇప్పలపల్లి, 25న రాజాపూర్, ఆముదాలపల్లి, కరీంపేట్,  26న గద్దపాక, కలువల, కేశవపట్నం 27న మెట్టుపల్లి, లింగాపూర్, ఎరడపల్లి, 28న కాచాపూర్, అర్కండ్ల, ముత్తారం గ్రామాలలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు తెలియజేశారు.