పట్టణప్రగతి హరితహారంలో మొక్కలు పంపిణీ

Published: Thursday July 08, 2021
జగిత్యాల, జులై 07 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని 7వ రోజన 21, 37, 28వ వార్డులలో పట్టణప్రగతి హరితాహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి మొక్కలు నాటారు. అనంతరం వార్డులో పర్యటించి ఇంటింటా మొక్కలను పంపిణీ చేశారు. 34వ వార్డులో కౌన్సిలర్ పిట్ట ధర్మరాజుతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని శ్రావణి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మరుతి ప్రసాద్ స్థానిక కౌన్సిలర్ అల్లే గంగాసాగర్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్ కూతురు రాజేష్ కోరే గంగమల్లు మేక పద్మ పంబాల రాము నాయకులూ నాగుల కిషన్ గౌడ్ దుమాల రాజ్ కుమార్ పర్వీన భాజీ అజ్జు భాయ్ వార్డు సభ్యులు ఏఈ ఆయుబ్ ఖాన్ బండారు నరేందర్  హరితహారం ఇంచార్జి విద్యాసాగర్ రావు మున్సిపల్ మెప్మా సిబ్బంది వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.