ఘనంగా మహర్షి వాల్మీకి జన్మదిన వేడుకలు

Published: Monday October 10, 2022
బోనకల్, అక్టోబర్ 9 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిషత్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి ఎంపీడీవో బోడిపూడి వేణుమాధవ్ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వేణుమాధవ్ మాట్లాడుతూ ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను రామాయణం అడుగడుగునా మనకు బోధించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, గొప్పగా ఎదగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సుబ్రహ్మణ్య శాస్త్రి, జూనియర్ అసిస్టెంట్ ఉమాదేవి, ఈజీఎస్ ఏ పీ ఓ బసవోజు కృష్ణకుమారి, మండల పరిషత్ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
 
 
 
Attachments area