నియోజవర్గ వైఎస్ఆర్ టిపి ముఖ్య నాయకుల సమావేశం

Published: Thursday October 27, 2022

మధిర రూరల్ 26 (ప్రజా పాలన ప్రతినిధి) వైయస్సార్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం గురువారం ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మధిర నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ మద్దెల ప్రసాద్ రావు చింతకాని ముదిగొండ మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి సామినేని రవి పేర్కొన్నారు. బుధవారం వారు మధిరలో విలేకరులతో మాట్లాడుతూ ముందుగా తెలంగాణ చిన్న తిరుపతిగా ఖ్యాతి గాడించిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అనంతరం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి బూత్ కమిటీలు ఏర్పాటు, ఇంటింటికి వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమం అమలుపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు సమావేశానికి మధిర నియోజకవర్గం నుండి వైయస్సార్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులు హాజరు కావాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర మండల అధ్యక్షులు ఐలూరి ఉమామహేశ్వర రెడ్డి ఎర్రుపాలెం మండల నాయకులు వేమిరెడ్డి మల్లారెడ్డి బోనకల్ మండల నాయకులు మౌలానా ఎస్సీ సెల్ నాయకులు మరియదాసు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మస్తాన్ పాషా పాల్గొన్నారు.