మంచాల మండల అభివృద్ధి లోకి తిస్కెళ్తం

Published: Wednesday September 15, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు జిల్లా పరిషత్తు నిధుల నుండి మంజూరైన పలు అభివృద్ధి పనులకు వర్క్ ఆర్డర్ ను అందజేసిన జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి గారు, గ్రామాల వారీగా జిల్లా పరిషత్తు నిధుల ఆరుట్ల10 లక్షలు, చెన్నారెడ్డి గూడ 10 లక్షలు, మరియు 15th ఫైనాన్స్ నుడి సుమారుగా 18 లక్షల రూపాయలు కేటాయించారు, ఈ సందర్భంగా మంచాల జడ్పిటిసి మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధికి నిధులు కేటాయింపుకు సహకరించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఎంపిటిసిలు మంచాల నరేందర్ రెడ్డి, నోముల జయ నందం, రాందాస్ నాయక్, చంద్ర శేకర్ రెడ్డి, సర్పంచ్ మమత అజేయ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వింజ మురి రాంరెడ్డి, నాయకులు మోతి రాం నాయక్, బొల్ల జెగన్, కరింగు జంగయ్య, జానయ్యా, శ్రీనివాస్ నాయక్, శ్రీదర్, రాజు నాయక్, లింగం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.