సుశీల కాలేజీలో అభినందన సభ

Published: Tuesday December 28, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి డిసెంబర్ 27 మధిర మున్సిపాలిటీ పరిధిలో సుశీలా కాలేజీలో మొదటి సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాలు అభినందన సభ సమావేశానికి టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు నీ ఆయుధం అయితే విజయం నీ భానిస అవుతుంది: డా.కోట రాంబాబుఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన డా.కోట రాంబాబు  మధిర లోని సుశీల కళాశాల నందు ఇటీవలే విడుదల అయిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ అమరనాథ్ అధ్యక్షతన ఘనంగా అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రముఖ వైద్యులు డా.కోట రాంబాబు విచ్చేసి విద్యార్థులను  అభినందించారు ఈ కార్యక్రమంలో రాంబాబు గారు మాట్లాడుతూ... కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని త్వరగా సాధించవచ్చు అని, అందరి ఆలోచనలు కూడా విజయం దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు అంతా కూడా మీ తల్లదండ్రులను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరారు. ఉపాధ్యాయులను గౌరవిస్తూ, చెడు మార్గాలలో తప్పు దోవ పట్టకుండా అందరూ కూడా మంచిగా చదువుకొని మీరు చదువుకున్న కళాశాలకు అతిథిగా వెళ్ళాలని అన్నారు. అలాగే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారుఅనంతరం కళాశాల అధ్యాపక బృందం అతిథిగా విచ్చేసిన డా.కోట రాంబాబు  సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అమరనాథ్, ప్రిన్సిపాల్ నవీన్ మిలీనియం స్కూల్ ప్రిన్సిపాల్ సునీల్ గోవింద్ విద్యార్థుల తల్లదండ్రులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు......