నేటి యువత గాంధీ మార్గంలో నడవాలి* * ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు గోపాల కృష్ణ గౌడ్*

Published: Tuesday October 04, 2022
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు డొంకని గోపాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం యువత గాంధీ మార్గంలో నడవాలని అన్నారు  అహింస మార్గంలో నడిచి భారత దేశానికి స్వాతంత్ర్య తెచ్చిన గొప్ప నాయకుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ బల్వంత్ రెడ్డి  ఉప సర్పంచ్ బాలరాజు  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ మంకాల దాసు టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు  జి. సత్యనారాయణ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు పిట్టల శేఖర్ . కాసిం   పీఏసీఎస్ వైస్ చైర్మన్ కె.ఇశ్వర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గ్రామపుర ప్రముఖులు భారతీయ జనతా పార్టీ నాయకులు దొండ రమణా రెడ్డి ,విష్ణువర్ధన్ రెడ్డి  డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.