వరదబాధితులకు సహాయం చేసిన మండల వాసులు

Published: Tuesday July 19, 2022

బోనకల్, జులై 19 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాపల్లి గ్రామానికి చెందిన తోట రామాంజనేయులు, నాగకృష్ణ వారి మిత్రబృందం సహాయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకటరావుపేట టీ కొత్తగూడెం గ్రామాలకు అవసరమైన 200 బెడ్ షీట్లు, ఓ ఆర్ ఎస్ పాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ భాష చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ సోదరుడు తోట నాగకృష్ణ వారి మిత్రుల సహాయంతో వరదలు కారణంగా నష్టపోయిన వారికి చిన్న చేయూతని అందించినట్లు తెలియజేశారు. గత రెండు రోజులుగా ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రజానీకాన్ని సహాయం చేయటానికి ప్రేరేపించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు