సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : కార్పొరేటర్ చేతన హరిష్

Published: Thursday September 30, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : హబ్సిగూడ డివిజన్ వాసవినగర్ స్ట్రీట్ నంబర్ 1లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ,  ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్య క్రమంలో స్థానికులు శ్రీనివాసచారి, వెంకటాచారి, బోనగిరి శ్రవణ్ కుమార్ గుప్త, బిజెపి సీనియర్ నాయకులు క్రిష్ణ, మల్లేష్ కోటమర్తి వెంకటేష్ దారం వెంకటేష్ గుప్త నారాయణదాసు ముశిగంపల శివగౌడ్ పుచ్చుల అశోక్ లు పాల్గొన్నారు.