వినాయక్ నగర్ కాలనీలలో పాదయాత్ర కార్పొరేటర్ : మోడల బాలకృష్ణ

Published: Monday July 19, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 37 డివిజన్లో కార్పొరేటర్ మోడల బాలక్రిష్ణ  ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమంలో వినాయక్ నగర్ కాలనీలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. కాలనీ వాసులతో అక్కడ ఉన్న కాలనీలో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు, డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, ముఖ్యంగా కొత్త కమిటీ హాల్ గురించి కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తెలిపారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... రెండు నెల్ల లోపల అధికారులతో చర్చించి కాలనీ కి సంబంధించినటువంటి, కాలనీవాసులు చెప్పినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని యుద్ధప్రాతిపదికన చేయిస్తానని చెప్పారు. వర్షాకాలంలో ప్రజలందరూ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరని (9441222913) అన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక నగర్ కాలనీ ప్రెసిడెంట్ జూపల్లి ప్రసాద్ రావు, కాలనీ జనరల్ సెక్రెటరీ బాలకృష్ణ, శ్రీనివాస్ రావు రవీందర్ రెడ్డి, జై శ్రీ నగర్ కాలనీ జనరల్ సెక్రెటరీ సురేందర్ రెడ్డి, కృష్ణా నాయక్, కృష్ణా రావు, రాము, గోపాలకృష్ణ, నారాయణ రావు జోషి, వెంకట స్వామి, బిజెపి యువ మోర్చా కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ ధర్మేందర్, సెక్రెటరీ కిరణ్ నాయక్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.