ప్రతి ఒక్కరు భక్తిభావం పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే జిఎంఆర్

Published: Tuesday June 29, 2021
పటాన్చేరు, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకుని, మానవ సేవే మాధవ సేవ గుణం అలవర్చుకోవాలని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో సొంత నిధులతో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.