కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ

Published: Monday October 11, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 10, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా లక్సీట్టిపెట్ మున్సిపాలిటీ, మండలం పరిధిలో ని వెంకట్రావు పేట,మోదెల 6వ వార్డు, 4, 5, 10, 11, 12, 13, 14, 15, వార్డులలో ఆదివారం కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ చేశారు. దాదాపు 5500 మంది కి పైగా మహిళలకు బతుకమ్మ చీరలను అందించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలకు మరో ఏడు సంవత్సరాలు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రజలకు సేవ చేయలేని వ్యక్తులు ఇతరుల విషయంలో నిందలు వేయడం సమంజసం కాదని వారు హితవు పలికారు. చిత్తశుద్ధి ఉంటే లక్సీట్టిపెట్ మున్సిపాలిటీ  పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు అరీఫ్, ఎంపీపీ మంగ చిన్నాన్న, వైస్ ఎంపీపీ దేవేందర్, పింగళి రమేష్, చింత సువర్ణ అశోక్, రందేని వెంకటేష్, కుమార్, శ్రీధర్, సుగునకర్, నవాబ్, హాజీ, చిన్న వెంకటేష్, చంద్రమౌళి, మల్లికార్జున్, రాకేశ్,  ప్రశాంత్, ఇంతయాజ్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.