జోగన్ పల్లి గ్రామ ఏంపిటిసి దూలూరి రాజు మృతి బాధాకరం : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Tuesday June 22, 2021
కోరుట్ల, జూన్ 21 (ప్రజా పాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామ ఎంపిటిసి దూలూరి రాజు గత కొంత కాలం నుండి ఆనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మరణించారు.వారు కుటుంబాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం రోజున వారి స్వగృహం జోగన్ పల్లి లో కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపిటిసి దులురి రాజు మృతి తీరని లోటని అన్నారు. విరి వెంట కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, గోపిడి రాజారెడ్డి, బిట్కు సహదేవ్, గౌతం, సాయికిరణ్, శేఖర్, గ్రామస్తులు ఉన్నారు.