పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన -ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్

Published: Tuesday July 05, 2022
రాయికల్,జులై 04 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పురపాలక సంఘానికి(పట్టణానికి) 4 లక్షల80వేల రూ:లతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని, పట్టణంలోని 5వ వార్డులోఒక్కొక్క సంఘానికి 5 లక్షల రూ.ల టి.యు.ఎఫ్.ఐ.సి. డి నిధులతో నిర్మించిన శ్రీకృష్ణ,మల్లన్నయాదవ సంఘం భవనాలను ఎమ్మెల్యే కె.సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం స్థానిక మార్కండేయ పద్మశాలి సేవా సంఘ భవనంలో ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరిగిన పలు అభివృద్ధి పనుల బ్రోచర్లను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మోర హనుమాన్లు,జెడ్పిటిసి అశ్వినిజాదవ్, ఏఎంసీ చైర్మన్ రాజారెడ్డి,వైస్ చైర్మన్ జి.రమాదేవి ఎంపీడీవో సంతోష్ కుమార్,డిప్యూటీ తాహసిల్దార్,పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,మహేందర్, అనిల్,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,తెరాస పార్టీ నాయకులు శ్రీనివాస్, రాజేష్,మోరరామ్మూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు.