కర్ణాకర్ రెడ్డి సొంత ఖర్చుతో వాలీబాల్ కిట్ అందజేశారు

Published: Saturday July 09, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 8ప్రజాపాలన ప్రతినిధి  మండలంలోని పోల్కంపల్లి గ్రామ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు మాడుగుల కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పోల్కంపల్లి గ్రామ విద్యార్థులకు  వాలీబాల్ కిట్టును అమనగంటి బాలరాజు, కంబాలపల్లి బాలరాజు, పంది స్వామిలతో కలిసి అందజేశారు. కరుణాకర్ రెడ్డి తన సొంత ఖర్చులతో వాలీబాల్ కిట్టును అందజేయడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామాలలో ఆడే ఆటలలోనే క్రీడాకారులు నైపుణ్యం బయటకు వస్తుందని, విద్యార్థులు వాలీబాల్ ఆటలో మంచి నైపుణ్యం సాధించి క్రీడల్లో ముందుండాలని సూచించారు. రానున్న రోజుల్లో వాలీబాల్ టోర్నీలో పాల్గొనేలా విద్యార్థులు మంచి శిక్షణ తీసుకొని గ్రామానికి మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, సాయి, చరణ్, నితిన్, ప్రవీణ్, సన్నీ, మాధవన్, గంట చరణ్, చింటూ, భాను, ఆదర్శ్, గూడెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.