జివిఆర్ ని కలిసి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు

Published: Friday February 03, 2023

మానకొండూరు ఫిబ్రవరి 02 ప్రజాపాలన రిపోర్టర్:


ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు పారునంది జలపతి ఆధ్వర్యంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జివి రామకృష్ణ రావుని నూతనంగా ఎన్నికైన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ మండల కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఉద్దేశిస్తూ జివి రామకృష్ణ రావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు పాటుపడుతూ, వారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేస్తూ ప్రత్యేకంగా యువతకు మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ , అహర్నిశలు జాతి కొరకు  చేసిన కృషిని జనంలోకి తీసుకుపోయి జనాన్ని చైతన్యపరిచే మంచి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం కమిటీ బాధ్యులకు అందరికీ శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వంతడుపుల సంపత్, సీనియర్ నాయకులు సంగుపట్ల మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి కొయాడ మురళి, నియోజవర్గ అధ్యక్షులు గంగిపెల్లి సంపత్, మండల బాధ్యులు బోర్ర రవి, దుర్గం అశోక్, ఖమ్మం కృష్ణ, తుర్పటి అజయ్,దుర్గం రాజ మల్లయ్య, కిన్నెర సతీష్, తాళ్లపల్లి నందకిషోర్, రోడ్డ రమేష్, అలవాల సంపత్, కిన్నెర అంజి, గాజసాగర్, ఎలుక పెళ్లి లక్ష్మణ్ ,తాటిపల్లి సంపత్, కండె అజయ్, గంధం శ్రీనివాస్,ఆసంపెళ్లి అశోక్, గోదరి కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.