తీవ్ర వర్షభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Published: Thursday July 14, 2022
వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ద సుధాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో జూలై 13 ప్రజాపాలన : తీవ్ర వర్షాభావం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి హితవు పలికారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బి టి ఎస్ కాలనీకి చెందిన 33 వ వార్డులో వర్షాభావ పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర వర్షాల వల్ల ఇబ్బందులకు గురవుతున్న వార్డు ప్రజల సమస్యలను అడిగి వాటిని వెంటనే పరిష్కరించారు. ముఖ్యంగా అండర్ డ్రైనేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని వివిధ శాఖల సిబ్బందికి సూచించారు. వెంటనే పనులు పూర్తి చేయించారు. వార్డు మొత్తం తిరిగి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని వార్డ్ ప్రజలకు తెలిపారు. వర్షాలు అధికంగా ఉండడం వల్ల సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు. చిన్నపిల్లలు వృద్ధుల పట్ల తగిన శ్రద్ద తీస్కొని జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.ఈ సందర్బంగా కాలనీ వాసులు రాకేష్ యాదవ్ పవన్ విజయ్ రెడ్డి శశి కాంత్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: