నాగేశ్వరావును పరామర్శించిన మాజీ ఎంపీ పొంగులేటి.. తల్లాడ, జనవరి 9 (ప్రజాపాలన న్యూస్):

Published: Tuesday January 10, 2023
తల్లాడ మండలంలోని నారయ్యబంజర గ్రామానికి చెందిన చల్లా నాగేశ్వరరావును ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం పరామర్శించారు. నాగేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పొంగులేటి ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, మువ్వా విజయబాబు, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, గణేశుల రవి, బానోతు నరసింహారావు, పొట్రు శ్రీనివాసరావు, బి నాగేశ్వరరావు, శీలం శ్రీనివాసరెడ్డి, మాగంటి శ్రీను, మీర్జా మైబు, చల్లా తిరుపతిరావు, సూర్యదేవర రమేష్ బాబు, చల్లా క్రిష్ణ యాదవ్, తదితరులు ఉన్నారు.