రేగాతోనే అభివృద్ధి సాధ్యం. బూర్గంపాడు మండలం బిఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి. బూర

Published: Wednesday November 16, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని నకిరి పేట గ్రామ పంచాయతీ  లోజరిగిన  మండల యూత్ కమిటీ సమావేశం లో  రాజకీయాల్లో , ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి  అన్నారు... టీఆర్‌ఎస్‌ పార్టీ బూర్గంపహాడ్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అద్యక్షతన నకిరి పేట లో జరిగిన మండల యూత్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని గోనెల నాని మాట్లాడుతూ...భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు  పినపాక నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా  గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు.  అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నుకున్న నకిరి పేట గ్రామ కమిటీ లో  అధ్యక్షులు గా కిలవత్ శివా , ప్రధాన కార్యదర్శి గా సీలం వెంకటేష్,ఉపాధ్యక్షులు గాబానోత్ కృష్ణ, దాసరి శ్రీనాథ్ సెక్రెటరీ గా బానోతు కిట్టు, జాయింట్ సెక్రటరీ  లు గా మడకo ఆనంద్, లకావత్ స్వామీ ల  ను గ్రామ యువత మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమం లో  ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి , మండల యూత్ అద్యక్షులు గోనెల నాని, ప్రధాన కార్యదర్శి యడమకంటి సుధాకర రెడ్డి,  మండల ప్రచార కార్యదర్శి తోకల సతీష్ ,మండల వైస్ ప్రెసిడెంట్ లు భగవాన్ రెడ్డి,కాధర్,  గ్రామ కమిటీ అధ్యక్షులు  అధ్యక్షులు బోల్ల వీరన్న, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు బండారి వంశీ, మండల యువజన    నాయకులు కోట రమేష్, మందా ప్రసాద్, మహేష్ , ఉపసర్పంచ్ బోళ్ళ వెంకన్న, తాటి సారయ్య,ధారవత్ మల్క,దాసరి లింగన్న మరియూ గ్రామ యువత  తదితరులు పాల్గొన్నారు....