పొదుపు చేసే అలవాటు ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుతుంది. నియంత్రిత సంస్థల నుండి అవసరమైనంత ఋణం మ

Published: Monday February 13, 2023

 

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
 
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 12, ప్రజాపాలన :
 
ప్రజలు నియంత్రిత సంస్థల నుండి అవసరమున్నంత ఋణం మాత్రమే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నెల 13 నుండి 17 వరకు నిర్వహించనున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు-2023 సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు నిర్వహించిన బ్యాంక్ ఉద్యోగుల 2 కె.ఎం. వాకథాన్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి దాసరితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, ఏవైనా కొనుగోలు చేసే ముందు ప్రణాళిక తయారు చేసుకొని అవసరం మేరకు తెలివిగా ఖర్చు చేయాలని తెలిపారు. పొదుపు చేసే అలవాటు ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుతుందని, సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్ అవసరాలకు కేటాయించాలని తెలిపారు. ప్రస్తుతం అధికమవుతున్న సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.  ఆన్లైన్లో ఋణాలు అందించే మొబైల్ యాప్ల నుండి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న కలెక్టర్ బ్యాంక్ సంబంధిత సమాచారం కోసం వినియోగించే నంబర్ను బ్యాంక్ అధికారిక వెబ్సైట్ నుండి పొందాలని తెలిపారు. ఓ.టి.పి., సి.వి.వి., పాస్వర్డ్, పిన్, బ్యాంక్ ఖాతా, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్రెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సాజిబ్కుమార్ సాహు, బ్యాంకు ఉద్యోగులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్