దోమ లో హైడ్రోక్లోరినేషన్ తో పిచుకారి..: సర్పంచ్ రాజిరెడ్డి

Published: Friday April 23, 2021

పరిగి, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ గ్రామపంచాయతీ పరిధిలో కరోనా వైరస్ నిర్ములనకు సోడియం హైడ్రో క్లోరినేషన్ తో గురువారం పీచుకారి చేయించినట్లు దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెకండ్ వేవ్ కోవిడ్ వ్యాప్తి వాళ్ళ ఇటీవల దోమ లో పలువురికి పాజిటివ్ రావడం మండల కేంద్రం కావడం వళ్ళ పలు గ్రామాల ప్రజలు నిత్యం దోమ కు వస్తుండటం వాళ్ళ ప్రధాన రహదారులు. అంతర్గత రోడ్లకి ఇరువైపులా శానిటైజేషన్ చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు పంచాయతీ పలు చెర్యలు తీస్కుంటుందన్నారు. మురుగు కాలు వలపై బ్లీచింగ్ పౌడర్ చల్లించమని. పారిశుధ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంన్నామని సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. ముక్యంగా ప్రజల వ్యక్తిగత శుభ్రత. మాస్కులు ధరించడం. సామజిక దూరం పాటిచటం వంటివి బాధ్యత తీసుకోవాలని చెప్పారు.