నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. బీజేపీ అధ్యక్షులు ఆపతి రామారావు..
Published: Monday October 10, 2022
తల్లాడ, అక్టోబర్ 9 (ప్రజా పాలన న్యూస్): నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బిజెపి తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన రైతుల పొలాలను పరిశీలించారు. రెడ్డిగూడెం సమీపంలో నర్సరీ ద్వారా నకిలీ మిరప నారు రైతులు తీసుకొచ్చి సాగు చేస్తే వాటికి ఇప్పటివరకు ఎటువంటి పూత రాలేదన్నారు. నకిలీ విత్తనాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, తక్షణమే రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరావు, కృష్ణారావు, రైతులు ఉన్నారు.
Share this on your social network: