ఘనంగా మహాత్మ శ్రీ బసవేశ్వర జయంతి విగ్రహా ఆవిష్కరణ మహోత్సవం

Published: Saturday May 15, 2021
పరిగి, 14 మే, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి గ్రామంలో మహాత్మ బసవేశ్వర స్వామి 888 వ జయంతిని పురస్కరించుకుని విరశైవ లింగాయత్ సంఘ సభ్యులు బసవేశ్వర విగ్రహాని  ఆవిష్కరించారు. అనంతరం శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గురు స్వామి  మల్లేపల్లి శివరాజ మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి బసవేశ్వర జయంతి ని చేస్తున్నామని ఈ సారి విగ్రహాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు. అలాగే సంఘ సభ్యులు మాట్లాడుతూ బసవేశ్వర స్వామి మoచి మంచి కార్యక్రమలు చేసారని భారతీయ ఏకత కి ఆయన ఎనలేని కృషి చేసారని అన్నారు.. ఈ కార్యక్రమంలో మల్లె పల్లి శివరాజ్, ఆనంద్, సతీష్ కుమార్, ఉదయ్ కుమార్, అశోక్ కుమార్, రాజు, సంఘమేశ్వర్, విశ్వనాథ్, ప్రవీణ్ కుమార్, భాను, తదితరులు పాల్గొన్నారు.