ఎజెండా గురించి వార్డులో ప్రజలతో సమావేశం
Published: Monday June 21, 2021
బాలపూర్, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక చట్టం 2019 సం లో సెక్షన్ 17, & 30, 31 ననుసరించి నగరపాలక సంస్థ మీర్ పేట్ లోని ఎజెండా అంశములలో 12వ వార్డు లో (20/6/2021) ఉదయం 10 గంటలకు బృందావన్ కాలనీ కమిటీ హాల్ లో కార్పొరేటర్, వార్డ్ ఆఫీసర్లు, ప్రజలు అందరూ కలిసి చర్చించుకున్నారు. డివిజన్ పరిధిలోని చర్చించిన అంశాలను రికార్డ్ చేసి కార్యాలయమునకు కార్పొరేటర్ సంతకం చేసి పంపడం జరుగుతుందన్నారు. చర్చించిచే అంశాలు (1) పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, (2) హరితహారం (3) త్రాగునీరు సరఫరా(4) పార్కులు, ఆటస్థలం పబ్లిక్ టాయిలెట్ నిర్వహణ (5) ఆస్తిపన్న ఇతర పన్నల వసూలు (6) అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధమైనవి, (7) కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంశములపై చర్చించుటకు హాజరు అయినా ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన స్థానిక కార్పొరేటర్ ఇంద్రావత్ రవి నాయక్.
Share this on your social network: