తిరుమలపురం(పీ.డీ) హెల్త్ క్లస్టర్లో ఇంటింట జ్వర సర్వేచేస్తున్న సిబ్బంది

Published: Friday May 07, 2021
​​గొల్లపల్లి, ఏప్రిల్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): గొల్లపల్లి మండలంలోని తిరుమలపురం (పీ.డీ)​ రంగాదామునిపల్లె లక్ష్మీపురం హెల్త్ క్లస్టర్ గ్రామాల్లో ఇంటింట జ్వర సర్వే ​తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో ఇంటింటా జ్వర ఆరోగ్య సర్వే నిర్వహించి వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు రికార్డు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదించేలా రూపకల్పన విధంగా, కరోన నివారణకు అవగాహ ధైర్యం భరోసా కల్పించడం. కరోన బాధిత కుటుంబాల వారిగా ఇంటింటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం ధైర్యం కల్పిస్తూన్నారు, తగు జాగ్రతలు సూచనలు చేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచులు ఎరవేణి రమేష్ దావు మల్లవ్వ- సతన్న కొసున హన్మంత రెడ్డి ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి కొఅప్షన్ సభ్యుడు మహమ్మద్ అలీ కార్యదర్శులు మల్లికార్జున్ షరీఫ్ రజిత డాక్టర్ సుధాకర్ రెడ్డి ఏఎన్ఎమ్ చిలుకమ్మ ల పర్యవేక్షణ మార్గదర్శనంలో ఆశా వర్కర్లు వసంత ఉమ మంగ  లక్ష్మీ రాధ రమా అంగన్వాడీ టీచర్స్ లాల్బీ లలిత హరిత రమాదేవి రాజేశ్వరి స్వప్న తిరుమల జీపి శిబ్బంది తదితరులు పాల్గొన్నారు.