సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి రద్దు
Published: Monday January 30, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 29 జనవరి ప్రజా పాలన : సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్ సమావేశము ఉన్నందున సోమవారం 30 తారీకున నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఆ ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురి కాకూడదని ఇట్టి విషయాన్ని గ్రహించాలని సూచించారు.
Share this on your social network: