విభిన్న పాత్ర పోషించిన మహామేధావి అంబేద్కర్.. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర..

Published: Friday April 14, 2023
తల్లాడ, ఏప్రిల్ 13 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని బస్వాపురం గ్రామంలో గురువారం 
భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్ నూతన విగ్రహన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. 
ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ సూరంపల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహా నాయకుడు అంబేద్కర్‌ ఆని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, ఎంపీపీ దొడ్డ. శ్రీనివాసరావు, జడ్పీటీసీ ప్రమీల, రెడ్డం.వీర మోహన్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, ఎంపీటీసీ ఆదూరి వెంకటేశ్వర్లు, జోనల్ చైర్మన్స్ దిరిశాల దాసురావు, బద్ధం. కోటి రెడ్డి, సర్పంచ్ జొన్నలగడ్డ. కిరణ్ బాబు, యూత్ అధ్యక్షులు శీలం శ్రీనివాస రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి కంపాటి శశి కుమార్ పాల్గొన్నారు.