సొంత ఖర్చుతో సోడియం హైపోక్లోరైట్ పిచికారి చేయించిన మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి

Published: Monday May 03, 2021
మేడిపల్లి, మే 2 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ కార్పొరేటర్ మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఉప్పల్ డివిజన్లోని ఓల్డ్ విలేజ్, భరత్ నగర్ తదితర కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాల కరోనా నియమ, నిబంధనలను పాటిస్తూ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గొరిగ జంగీర్, బోరంపేట జై కృష్ణ, సల్ల ప్రభాకర్ రెడ్డి, మంద మురళీకృష్ణ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాలయ్య, నరేష్, జంగీర్, రాము, జీతు తదితరులు పాల్గొన్నారు.