పార్కు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Thursday June 17, 2021

పటాన్చెరు, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతి నగర్, ఆల్విన్ కాలనీల పరిధిలో తొమ్మిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టదలచిన పార్క్ అభివృద్ధి పనులను పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. పటాన్చెరు రామచంద్రాపురం సర్కిల్ పరిధిలోని 3 డివిజన్ల పరిధిలోని పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు తెలిపారు.