ప్రతి పల్లె పచ్చదనం తో కళకళలాడాలి ఎంపీడీవో చంద్రశేఖర్..
Published: Friday July 09, 2021
పాలేరు జులై 8 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రతి పల్లె పచ్చదనం తో విరియాలని నేలకొండపల్లి ఎంపీడీఓ యం.చంద్రశేఖర్ సూచించారు. మండలంలోని కోనాయిగూడెం, కోరట్లగూడెం. పైనంపల్లి, నేలకొండపల్లి తదితర గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎంపిడిఓ చంద్రశేఖర్, మాట్లాడుతూ. తెలంగాణ కు హరితహారం ఒక సామాజిక బాధ్యత గా తీసుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. ప్రతి పల్లె పచ్చటి వాతావరణం తో కళకళలాడాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ను విజయవంత చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో సునీత, పీఆర్.ఏఈ విద్యాసాగర్. సర్పంచ్లు రాయపూడి నవీన్. విజయలక్ష్మి. పెంటమళ్ల పుల్లమ్మ, ఎంపీటీసీ వాసవి. పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: