కుర్నవల్లిలో ఘనంగా అయ్యప్పల ఇరుముడి..

Published: Monday December 06, 2021
తల్లాడ, డిసెంబర్ 5 (ప్రజాపాలన న్యూస్): మండలంలోని కుర్నవల్లి గ్రామంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి ఆదివారం ఘనంగా నిర్వహించారు. హరిహరసుతుడు అయ్యప్పస్వామికి 41 రోజులు కఠిన దీక్ష చేసి,పూజలు చేస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోషలతో అయ్యప్ప సన్నిధానంలో అయ్యప్పలకు, అయిలూరి బిక్ష్మ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో హరీష్ శర్మ చే ఇరుముడి కట్టుకొని శబరిమలైకు పయనమయ్యారు. అనంతరం భక్తులకు మహాఅన్నదాన ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో హానన్యమాత, జంపాల వెంకటరమణ, చింటూ స్వామి, గూడూరు నర్సిరెడ్డి, అన్నెం కోటరెడ్డి పలువురు అయ్యప్ప మాలదారులు, భక్తులు పాల్గొన్నారు.