వెల్గటూర్ ప్రజాసంఘాల జె.ఏ.సీ మండల అధ్యక్ష, కార్యదర్శులు

Published: Saturday June 11, 2022

పూదరి రమేష్, మోత్కురి వేణు.

వెల్గటూర్, జూన్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) :  తెలంగాణ ప్రజాసంఘాల జె.ఏ.సి వెల్గటూర్ మండల అధ్యక్షులు గా పూదరి రమేష్, ఉపాద్యక్షులుగా నేరేళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి గా మోత్కురి వేణు, సలహాదారులు ఎం.డి. అప్సర్, ముచ్చేర్లే మహేష్, గంగాదర తిరుపతి, ఇంజపూరి రాజేష్ లను నియమించినట్లు తెలంగాణ ప్రజాసంఘాల జే.ఏ.సి  కార్యనిర్వాహక కమిటీని శుక్రవారం కిషన్రావుపేట నాగవెల్లి లక్ష్మీ నర్సింహాస్వామి దేవాలయ పంక్షన్ హాల్లో  జే.ఏ.సీ జిల్లా అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పేట భాస్కర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాజ్యాంగన్ని రక్షించుకోవడం, దళిత బహుజన ప్రజాసంఘాల అభివృద్ధే లక్ష్యం గా ముందుకు వెళ్లాలని ఆయన  కమిటీకి సూచించారు. అన్ని గ్రామాల్లో జే.ఏ.సీ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమములో టి.పి.ఎస్. జే.ఏ.సీ జిల్లా ఉపాద్యక్షులు కొండ వెంకటేష్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెలమద్ది వినోద్, ప్రధాన కార్యదర్శి మోకినిపల్లి బాబు, ఉపాధ్యక్షులు మాతంగి లక్ష్మణ్,తాటి నాగరాజు, దర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు దూడ భూమయ్య, ఉపాద్యక్షులు ఎ. దుర్గప్రసాద్, సర్పంచ్ మెరుగు కోమురయ్య, ఉప సర్పంచ్ పూదరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.